వేములవాడ చాళుక్యులు - Vemulawada Chalukyas Dynasty

వేములవాడ చాళుక్యులు (క్రీ.శ.750 - 973)

వీరు రాష్ట్రకూటుల సామంతులు. 
వీరి మూలపురుషుడు సత్యాశ్రయ రణ విక్రముడు (శాసనాల ప్రకారం) (క్రీ.శ.650-675)
పృథ్వీపతి (క్రీ.శ.675-700)
మహారాజు (క్రీ.శ.700-725)
పృధు విక్రముడు (క్రీ.శ.725-750)
కానీ వీరి పరిపాలన కాలం ఎక్కడ పరిపాలించింది స్పష్టంగా లేదు. 

వినయాదిత్య యుద్ధమల్లుడు (క్రీ.శ.750-775)
  • ఇతను వేములవాడ చాళుక్యుల నిజమైన స్థాపకుడు 
  • ఇతని రాజధాని బోధన్ 
  • గోదావరి నదికి దక్షిణాన గల మంజీరా నది నుండి మహాకాళేశ్వర పర్వంతం వ్యాపించి ఉన్న భూభాగమే 'పోదనపాడు' దీనినే సపదాలక్షదేశం అంటారు. ఇదే నేటి వేములవాడ చాళుక్య రాజ్యం 
  • ఇతను రాష్ట్రకూట రాజ్యస్థాపకుడైన దంతిదుర్గుడు యొక్క సేనాధిపతి, తరువాత సామంత రాజు అయ్యాడు. 
మొదటి అరికేసరి (క్రీ.శ.775-800)
  • ఇతడు వినయాదిత్యుడు కుమారుడు 
  • ఇతని సోదరుడు బీరన్న గృహుడు, బీరన్న గృహుడు వేయించిన శాసనం 'కురువ గుట్ట'
  • ఇతను రాష్ట్రకూట రాజు ధ్రువుని యొక్క సామంతుడు 
  • ఇతను రాజధానిని బోధన్ నుంచి వేములవాడకు మార్చాడు. 
  • ఇతనికి కల బిరుదులు సమస్త లోకాశ్రయా, త్రిభువనమల్ల, రాజత్రినేత్ర, సాహసరాయది 
  • మొదటి అరికేసరి వేయించిన శాసనం 'కొల్లిపర శాసనం'
  • అరికేసరి యొక్క కుమారుడు నరసింహుడు (క్రీ.శ.800-825)  
  • నరసింహుడు యొక్క కుమారుడు రెండవ యుద్ధమల్లుడు (క్రీ.శ.825-850) 
 బద్దెగ (క్రీ.శ.850-895)
  • ఇతను రెండవ యుద్ధమల్లుని యొక్క కుమారుడు 
  • ఇతనికి కల బిరుదు సోలాదగండ, అంటే అపజయమెరుగని యోధుడు అని అర్థం(42 యుద్దాలు చేసినవాడు)
  • ఇతను వేంగీ రాజు మొదటి చాళుక్య భీముడిని ఆడించినట్లు, బంధించినట్లు 'పర్బనీ శాసనం (క్రీ.శ.966)' తెలియజేస్తుంది. 
  • ఇతను వేములవాడలో తన పేరుమీదుగా 'బద్దిగేశ్వర' ఆలయాన్ని నిర్మించాడు. 
  • ఇతను కుమారుడు యుద్ధమల్లుడు (క్రీ.శ.895-915)
  • యుద్ధమల్లుని కుమారుడు రెండవ నరసింహుడు (క్రీ.శ.915-930)
రెండవ నరసింహుడు (క్రీ.శ.915-930)
  • ఇతను రాష్ట్రకూట రాజైన మూడవ ఇంద్రునికి (క్రీ.శ.915-922) సామంతుడు 
  • ఇతను తన దండ యాత్రను గంగా నది వరకు చేసినాడు 
  • కాళప్రియ వద్ద విజయస్తంభాన్ని నాటాడని వేములవాడ శాసనం తెలియజేస్తుంది. ఇది సంస్కృత శాసనం. 
రెండవ అరికేసరి (క్రీ.శ.930-955)
  • ఇతను వేములవాడ చాళుక్యులలో గొప్పవాడు 
  • ఇతని కాలంలోనే వేంగీ రాజ్యంలో వారసత్వ యుద్దాలు మొదలైనాయి 
  •  పంప కవి ఇతని ఆస్థానకవి. ఇతని యొక్క రచనలు విక్రమార్జుని విజయం, ఆది పురాణం 
  • పంప కవి యొక్క సోదరుడు జీనవల్లభుడు  'కార్క్యల శాసనం' ప్రకారం పంప కవి క్రీ.శ.902 లో జన్మించాడని క్రీ.శ.941లో ఆది పురాణం రచించాడని తెలుస్తుంది. 
  • ఆదిపురాణం జైనమత మొదటి తీర్థంకరుడు 'వృషబానాధుడు చరిత్ర / పంచకళ్యాణం' గురుంచి తెలుపుతుంది. 
వాగరాజు (క్రీ.శ.955-960)
  • రాష్ట్రకూట రాజు 3 వ కృష్ణుని సామంతుడు 
  • ఇతని రాజధాని గంగాధర పట్టణం 
  • ఇతని ఆస్థాన కవి సోమదేవసూరి. ఇతని రచించిన కావ్యం యశస్తిలక చంపూ 
  • ఇతనికి సంతానం లేరు 
రెండవ బద్దెగుడు (క్రీ.శ.960-965)
  • ఇతను వేగరాజు సోదరుడు 
  • సోమదేవసూరి కోసం 'శుభధామ జీనాలయము'నిర్మించాడని వేములవాడ శాసనం తెలియజేస్తుంది. దీనికి కల మరొక పేరు బద్దెగ జీనాలయము 
మూడవ అరికేసరి (క్రీ.శ.965-973)
  • వేములవాడ చాళుక్య వంశంలో చివరివాడు 
  • ఇతను ఫర్భిణి శాసనం (క్రీ.శ.966), కరీంనగర్ తామ్రశాసనం (క్రీ.శ.966) అనే రెండు తామ్రశాసనాలు వేయించాడు. 
  • ఇతనియొక్క రాజధాని వేములవాడ 
ఇతని తరువాత తెలంగాణ ప్రాంతం కళ్యాణి చాళుక్యుల చేతుల్లోకి వెళ్ళింది. 
తెలంగాణాలో క్రీ.శ.940 నాటి కర్మాల శాసనంలో మొదటిసారి పద్యాలు లభించాయి.